31-05-2025 12:20:21 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
పాపన్నపేట, మే 30: మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగంగా జరుగుతుందని, కొనుగో లు చేసిన డబ్బులు త్వరితగతిన చెల్లించడం ద్వారా రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతున్నా రని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
శుక్రవారం పాపన్నపేట మండలంలోని మిన్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి కేంద్రాల నిర్వహకులు, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సంవత్సరం 2,90,414 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రూ.555.79 కోట్లు రైతులకు చెల్లింపులు జరిగాయన్నారు. పాపన్నపేట తహసిల్దార్ సతీష్, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు పాల్గొన్నారు.