11-06-2025 11:59:40 PM
ఆదిలాబాద్ పర్యటనలో విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డి..
అదిలాబాద్ (విజయక్రాంతి): నూతన విత్తన చట్టం-2025 రూపకల్పనలో రైతుల సూచనలు తీసుకొని త్వరలో అమలులోకి వచ్చేలా చర్యలు చేపడతామని విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్(State Chairman of Seed Development Corporation) అన్వేష్ రెడ్డి(Anvesh Reddy) తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్యామాలదేవితో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన విత్తన చట్టం-2025 ముసాయిదా తయారి కోసం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు, జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులు, సీడ్ ఆర్గనైజర్లు, విత్తన కంపెనీ ప్రతినిధులు, డీలర్లు, రైతుల అభి-ప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
అంతకు ముందు జిల్లాకు వచ్చిన అన్వేష్ రెడ్డికి కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయ-కులు శాలువా కప్పి, పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ... కో మార్కెటింగ్ వ్యవస్థను కట్టడి చేసేలా చట్టంలో నిబంధనలు పొందుపరచనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఈ విత్తన చట్టం ముసా-యిదా కమిటీని ఏర్పాటు చేయడంతో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. అందరి సూచనలు సలహాలు పరిగణలోకి తీసుకుని విత్తన చట్టం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావే-శంలో అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ శైలజ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ స్వామి, ఉద్యానవన శాఖ అధికారి సుధాకర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మల్లేష్, ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి, కో ఆర్డినేటర్ కొండ గంగాధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.