08-08-2025 01:10:40 AM
ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు
బెల్లంపల్లి, ఆగస్టు 7 : అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ గృహాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని సిర్పూర్ శాసన సభ్యులు పాల్వాయి హరీశ్బాబు అన్నారు. గురువారం కన్నెపల్లి మండలంలోని మాడవెల్లి, సాలిగాం గ్రామాల్లో ఆయన పర్యటిం చారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తిం చి మంజూరు చేసిన ధ్రువీకరణ పత్రాలను ఆయన అందజేశారు. అనంతరం గ్రామం లో నాయకులతో కలిసి పాల్వాయి హరీశ్ బాబు మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమం లో కన్నెపల్లి ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, బెల్లంపల్లి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరపు వెంకట నర్సింగరావు, కన్నెపల్లి, భీమిని మండలాల అధ్యక్షులు పప్పుల రామాంజనేయ, లక్ష్మీనారాయణ, మాజీ మండల ఉపాధ్యక్షులు రాకేష్, బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఏల్పుల రోహిత్ పాల్గొన్నారు.