1 September, 2026 | 1:43 AM

గ్రామాల అభివృద్ధికి కృషి

01-09-2026 12:14 AM

భైంసా ఆగస్టు 31 ( విజయ క్రాంతి) గ్రామాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు అధిక నిధులు మంజూరు చేసి ప్రాధాన్యమిస్తోందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బాసర మండలంలోని దొడాపూర్, కిర్గుల్-బి, గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు సోమవారంఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.దోడాపూర్ గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఫంక్షన్ హాల్కు భూమిపూజ చేశారు.

అనంతరం కిర్గుల్-బి గ్రామంలో రూ.45 లక్షలతో చేపట్టనున్న మహిళా సమైక్య సంఘ భవనం, గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం బాసర మండల కేంద్రంలోని పాపహరేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బాసరలో నూతనంగా ఏర్పాటు చేసిన టిఫిన్ సెంటర్ను ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.