1 September, 2026 | 12:35 AM

నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి, ఓటర్ల సవరణపై ప్రత్యేక దృష్టి

01-09-2026 12:29 AM

కౌన్సిల్ సమావేశం

09, 10 వార్డుల్లో ఓటర్ల హియరింగ్ నిర్వహణ

​నర్సాపూర్: నర్సాపూర్ పురపాలక సంఘంలో పట్టణాభివృద్ధి పనులు, ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మాచునూరి లక్ష్మి రాజు యాదవ్ అధ్యక్షతన, కమిషనర్ చెరుకు సాయికుమార్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ​పట్టణంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడమే కాకుండా ​విద్యుత్ సమస్యలతో పాటు పట్టణ పరిధిలోని పలు ఇతర ప్రజా సమస్యలపై  చర్చించారు.

​ఓటర్ల జాబితా సవరణకు దరఖాస్తుల స్వీకరణ:

ఎస్.ఐ.ఆర్ (సార్ ) ప్రక్రియలో భాగంగా మున్సిపల్ పరిధిలోని 09, 10 వార్డులలో ఏ ఈ ఆర్ వో మరియు కమిషనర్ సాయికుమార్ ఆధ్వర్యంలో ఓటర్ల హియరింగ్ నిర్వహించారు. ​ఓటర్ల జాబితాలోని తప్పుల సవరణకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ​ప్రజలందరూ మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను పరిశీలించి, తప్పులుంటే వార్డు సభల్లో దరఖాస్తులు అందజేయాలని కమిషనర్ సూచించారు. ​