ముస్లిం సోదరులకు ఈద్ కా తోఫా పంపిణీ
సనత్గర్, మార్చి 14 (విజయక్రాంతి): సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోటా నీలిమ సూచనల మేరకు రంజాన్ పండుగ సందర్భంగా అమీర్పేటలోని రత్నదీప్ సమీ ప మస్జిద్ వద్ద ఈద్ కా తోఫా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మస్జిద్కు నమాజ్కు వచ్చిన ముస్లిం సోదరులకు దుస్తులను పంపిణీ చేసి రంజాన్ పం డుగ శుభాకాంక్షలు తెలిపారు.
పండుగ సందర్భంగా అవసరమైన వారికి సహాయం చేయడం, ఆనందాన్ని పంచుకోవడం కాంగ్రెస్ ఎప్పటికీ పాటించే సంప్రదా యం అని నిర్వాహకులు తెలిపారు. అమీర్పేట ప్రాంతంలోని ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ పండుగ ఆనందాన్ని పంచుకోవడం సంతోషకరమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్, శ్రీకాంత్ యా దవ్, రాజేశ్వరి, రజనీకాంత్, అమృత, షాబా ద్ నవీన్, శశికాంత్, సందీప్ పవార్, ముత్తు, చుక్క నరేష్ తదితరులు పాల్గొన్నారు.




