23-12-2025 08:32:21 PM
రేగొండ,(విజయక్రాంతి): విద్యుత్ షాక్ తో వృద్ధ రైతు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం ఆర్ జి తండాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్ జి తండా కు చెందిన అజ్మీర రుప్లా నాయక్ (75) తన మొక్కజొన్న చేనుకోసం నీరు పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు.మృతుడి భార్య కమలమ్మ ఫిర్యాదు మేరకు రేగొండ ఎస్సై కె.రాజేష్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.