13-06-2025 12:00:00 AM
కార్వాన్, జూన్ 12: మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడిన 60 ఏళ్ల వృద్ధుడికి న్యాయస్థానం ఐదేళ్ల కఠిన కారాకార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ కేసు వివరాలను లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్ వెంకటరాములు గురువారం మీడియాకు వెల్లడించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని నానల్ నగర్ ఖాదర్ బాగ్ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల ముస్తఫా హుస్సేన్ 2018 సంవత్సరంలో ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు లంగర్ హౌస్ పోలీసులు అప్పట్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆసిఫ్ నగర్ డివిజన్ ఏసిపి చక్రవర్తి (రిటైర్డ్) కేసు విచారణ జరిపి నాంపల్లిలోని 12వ అడిషనల్ సెషన్స్ కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి అనిత గురు వారం తీర్పు వెల్లడించారు. ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.
అదేవిధంగా 1000 రూపాయల జరిమా నాను నిందితుడు చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే మూడు నెలల సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉం టుందని న్యాయమూర్తి వెల్లడించిన్నట్లు లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్ వెంకట రాములు పేర్కొన్నారు. ఈ కేసును అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామ్ రెడ్డి వాదించారు. కోర్టు విధులు సక్రమంగా నిర్వర్తించి నిందితుడికి కఠిన కారాగార శిక్ష విధించేలా చర్యలు తీసుకున్న కోర్టు సిబ్బందిని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు అభినందించారు.