calender_icon.png 21 May, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధురాలిపై దాడి.. నగలు చోరీ

20-05-2025 01:28:01 AM

ముగ్గురు నిందితులు అరెస్ట్

వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ కే శివరామిరెడ్డి 

నల్లగొండ టౌన్, మే 19 : ఇంట్లో ఒంటరిగా వున్న వృద్దురాలిపై దాడి చేసి నగల చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను నేరం జరిగిన 24 గంటల లోపే  అరెస్టు చేసి  వారి వద్ద నుండి  వ (3) తులాల బంగారు ఛైను, (మూడు లక్షల విలువ) నాలుగు రోల్ గోల్ గాజులు, హోండా యాక్టివా,  మూడు సెల్ ఫోన్ ల ను స్వాధీనం చేసుకున్నట్లు  నల్లగొండ డిఎస్పికే శివరామిరెడ్డి  తెలిపారు.

సోమవారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 17న  నకిరేకల్ పట్టణంలోని విటి కాలనీ లో ఉంటున్న నాగులవంచ లక్ష్మమ్మ  వృద్దురాలిని గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఒంటరిగా వున్నా ఆమెను కట్టేసి, చేతులతో కొట్టి గాయపరచి  ఒంటి మీద ఉన్న మూడు తులాల పుస్తెల త్రాడును, నాలుగు రోల్ గోల్ గాజులను దొంగలించారు.

ఎస్పీ  శరత్ చంద్ర పవార్ సూచనలు  మేరకు నల్లగొండ డిఎస్పిశివరాం రెడ్డి  పర్యవేక్షణలో నకిరేకల్ సి.ఐ రాజశేఖర్  ఆధ్వర్యంలో ఎస్త్స్ర  బి.లచ్చిరెడ్డి,  శాలిగౌరారం ఎస్త్స్ర   డి.సైదులు, తిప్పర్తి ఎస్త్స్ర   బి.సాయి ప్రశాంత్ లు  మూడు ప్రత్యేక బృందాలతో వేర్వేరు ప్రదేశాలలో నేరస్తుల కొరకు తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల్లో భాగంగా  ఈనెల 18న   తిప్పర్తి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఒక హోండా యాక్టివా మోటార్ సైకిల్ పైన వెళుతున్న ఇద్దరు వ్యక్తులు పోలీసు లను చూసి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించగా, అనుమానం కలిగి, వెంటపడి పట్టుకొని తనిఖీ చేయగా వారి దగ్గర ఒక పుస్తెల త్రాడు దొరికింది.

తదుపరి విచారణలో సదరు వ్యక్తులు ఈ నెల 17న    వి.టి. కాలని, నకరేకల్ లో ఒక వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లి కిరాయికి ఏమైనా రూమ్ ఖాళీగా ఉన్నాయా అని అని అడుగగా, ఖాళీ లేదని చెప్పడంతో,త్రాగడానికి నీళ్ళు కావాలని అడుగగా, సదరు వృద్ధురాలు నీళ్ళు తీసుకొని రావడానికి లోనికి వెళ్ళిన సమయంలో, ఆమె ఇంటి లోనికి జొరబడి, ఆమెను ఒక దుప్పటిని చింపి దానితో, ఆమె మూతిని, కాళ్ళు, చేతులు కట్టివేసి, చేతులతో ఆమె మొఖం పైన పిడి గుద్దులు గుద్ది, ఆమె ఒంటి పైన వున్నాఒక బంగారం చైను, చేతికి వున్నా గాజులు (రోల్ గోల్డ్) గుంజుకొని పారిపోయినట్లు తెలిపారు. కేసును చేదించిన  ఎస్సైలను  సిబ్బందిని పోలీసులు అభినందించారు.