06-06-2025 01:00:02 PM
లక్షెట్టిపేట, విజయక్రాంతి: మున్సిపాలిటీలోని గంపలపల్లి గ్రామం లో ప్రమాదవశాత్తు బావిలో పడి బొప్పు శంకరవ్వ (69) అనే వృద్ధురాలు మృతి చెందిందని ఎస్ఐ గోపతి సురేష్ శుక్రవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మృతురాలి స్వస్థలం రాయపట్నం తన మనుమని వివాహం సందర్భంగా ఈ నెల 4న గంపలపెళ్లి గ్రామానికి వచ్చి తిరిగి రాత్రి తన స్వగ్రామం రాయపట్నం వెళ్తా అని చెప్పి వెళ్ళింది. కానీ ఇంటికి వెల్లకపోగా కుటుంబీకులు తెలిసిన వాళ్ళ ఇండ్లలో వెతికిన ఆచూకీ దొరక్కపోతే గురువారం రాత్రి లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. శుక్రవారం ఉదయం గంపలపెళ్లి బావిలో శవంగా కనిపించడంతో బంధువులు వెళ్లి చూసి తప్పిపోయిన శంకరవ్వ మృతదేహం అని గుర్తించిన మృతురాలి కూతురు అప్పని మంగవ్వ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.