24-06-2025 11:03:00 PM
పాల్గొన్న జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నల్గొండ మండలం వెలుగు పల్లి గ్రామంలో రైతు భరోసా సంబురాలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసిన సందర్భంగా మంగళవారం హైదరాబాదులోని సెక్రటేరియట్ వద్ద నిర్వహించిన రైతు విజయోత్సవ సంబరాలలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల ప్రయోజనార్ధం ప్రత్యేక ప్రసారం చేయగా నల్లగొండ మండలం వెలుగుపల్లి రైతు వేదికలో జిల్లా రెవిన్యూ జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్(District Revenue Joint Collector Srinivas)తో పాటు పలువురు జిల్లా అధికారులు, రైతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి అనంతరెడ్డి, వ్యవసాయ శాఖ ఏవో, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జూలకంటి వెంకట్ రెడ్డి, మాజీ ఎంపిటిసి బీరం కరుణాకర్ రెడ్డి, పలువురు మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.