15 April, 2026 | 12:58 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

టేకులపల్లిలో పోలింగ్ కేంద్రాలకు చేరిన ఎన్నికల సామగ్రి

16-12-2025 07:22 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండలంలోని 36 పంచాయతీలకు ఎన్నికల సిబ్బందికి సామగ్రిని టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో పంపిణీ చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని భారీ పోలీసు బందోబస్తు మధ్య తరలించినట్లు ఎంపీడీవో మల్లేశ్వరి తెలిపారు. 36 పంచాయతీలకు 850 మంది సిబ్బంది ఎన్నికల విధులకు హాజరయ్యారని తెలిపారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా ట్రైనీ కలెక్టర్ మురళి సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు.