టేకులపల్లిలో పోలింగ్ కేంద్రాలకు చేరిన ఎన్నికల సామగ్రి
16-12-2025 07:22 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండలంలోని 36 పంచాయతీలకు ఎన్నికల సిబ్బందికి సామగ్రిని టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో పంపిణీ చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని భారీ పోలీసు బందోబస్తు మధ్య తరలించినట్లు ఎంపీడీవో మల్లేశ్వరి తెలిపారు. 36 పంచాయతీలకు 850 మంది సిబ్బంది ఎన్నికల విధులకు హాజరయ్యారని తెలిపారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా ట్రైనీ కలెక్టర్ మురళి సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు.






