01-10-2025 01:17:16 AM
అధికారులు ఎలక్షన్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి
కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశం
నిర్మల్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణకు అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ, జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నా రు. ప్రతీ అధికారి ఎలక్షన్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఎన్నిలక కోడ్ అమలులో ఉన్నందున గ్రామాల్లో ఎటువంటి రాజకీయ ఫ్లెక్సీలు, వాల్ పెయింటింగ్స్ ఉండకూడదని అన్నారు.
రాజకీయ పార్టీల కార్యక్రమాలకు అధికారుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలను అధికారులు పర్యవేక్షించా లని చెప్పారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఇప్పటికే చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, అధికారులు ఎప్పటికప్పుడు చెక్ పోస్టులను తనిఖి చేస్తూ ఉండాలని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఎఫ్ఎస్టి, విఎస్టి, ఎస్ఎస్టీ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వివరించారు.
రూట్ అధికారులు పోలింగ్ కేంద్రాలకు ముందుగానే వెళ్లి, ఆయా మార్గాల్లో ఏవైనా ఇబ్బం దులు ఉన్నాయేమో చూడాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు.
ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు విస్తృత శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డిపిఓ శ్రీనివాస్, సిపిఓ జీవరత్నం, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.