ఈదురు గాలులతో విరిగిన విద్యుత్ స్తంభాలు
08-06-2026 07:59 PM
ఉట్నూర్,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలంలోని ధానోరా(బి ), మల్లాపూర్ తదితర గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం 7:30 గంటల ప్రాంతంలో ఈదురు గాలులతో వర్షం కురవడంతో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరగడంతో పాటు చెట్లు సైతం నేలకొరిగాయి. సాయంకాలం విద్యుత్ సరఫరా లో అంతరాయం జరిగింది. విద్యుత్ స్తంభాలు పడిపోయిన విషయం తెలియగానే విద్యుత్ శాఖ ఎస్ ఈ రాథోడ్ శేషారావు తోపాటు విద్యుత్ శాఖ అధికారులు గిరిజన గ్రామాలు పరిశీలించి అప్పటికప్పుడే విరిగిన విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసే విద్యుత్ సరఫరా చేశారు.






