28-06-2025 12:23:34 AM
కామారెడ్డి,(విజయక్రాంతి): దేశ చరిత్రలో చీకటి అధ్యాయం ఎమర్జెన్సీ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో కాంగ్రెస్ విధించిన ఎమెర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆరోజుల్లో ప్రజలపై జరిగిన దుశ్చర్యలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పునాదులను కదిలించడానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతగా వ్యవహరించారన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ, పౌర హక్కులను కాలరాస్తూ 21నెలల పాటు సాగిన నియంతృత్వ పాలనను ఎదురించిన వీరులందరికి జోహార్లు తెలిపారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.
ఉద్యమంలో పాల్గొన్న వీరులకు సన్మానం..
ఎమర్జెన్సీ కాలంలో ఉద్యమంలో పాల్గొన్న రంజిత్ మోహన్, రాజిరెడ్డిని సన్మానించారు.