1 July, 2026 | 8:13 PM

Breaking News

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •  

పాత జిల్లాల వారీగానే ఉద్యోగుల సర్వీస్!

23-07-2024 01:27 AM

317 జీవోను పరిష్కరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం

త్వరలో మరోసారి భేటీ

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పాత జిల్లాల పరిధిగా పరిష్కరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. 317 జీవోపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సోమవారం సమావేశమైంది. ఈ సమావేశంలో త్రిసభ్య కమిటీ సభ్యులైన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

తొమ్మిది ప్రభుత్వ శాఖలపై ప్రధానంగా కమిటీ చర్చించింది. పాత జిల్లాల వారీగా ఉద్యోగుల సర్వీస్, పదోన్నతుల అంశాలను పరిగణలోకి తీసుకొని 317 జీవోను పరిష్కరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ ఈమేరకు నిర్ణయించింది. అయితే వివిధ శాఖల అధికారులు వారి శాఖల పరంగా పూర్తి సమాచారం ఇవ్వనందున యుద్ధ ప్రాతిపదికన పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను కమిటీ ఆదేశించింది. సమావేశంలో  ఉన్నతాధికారులు నవీన్ మిట్టల్, మహేష్ కుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు, అడిషనల్ డీజీ షికా గోయల్, ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.