1 July, 2026 | 7:08 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

తెలంగాణలో ఫ్యూచరిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రం

23-07-2024 01:26 AM

ఏర్పాటుకు ముందుకొచ్చిన వారికి అన్ని విధాలా సహకరిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు 

హైదరాబాద్, జూలై 22 (విజయ క్రాంతి): తెలంగాణలో ఫ్యూచరిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రం ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యాంశంగా పరిశీలిస్తుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఫ్యూచరిస్టిక్ కేంద్రంపై కొందరు పారిశ్రామికవేత్తలు సోమవారం సచివాలయంలో మంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం ఆవిష్కరణకు అవసరమైన రూ.500 కోట్ల నిధులను సమకూర్చేందుకు ఏదైనా వాణిజ్య సంస్థ ముందుకొస్తే ప్రభు త్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా నిధుల సమీకరణనూ పరిశీలిస్తామన్నారు. భారీ మాల్ తరహాలో ఉండే  ఈ కేంద్రంలో సమావేశ మందిరాలు, సినిమా హాళ్ల ఏర్పాట్లతోపాటు తెలంగాణ ఘనచరిత్ర, సాధించిన అభివృద్ధి, భవిష్యత్ గమ్యాల గురించి అవగాహన కల్పి ంచే విభాగాలు ఉంటాయని స్పష్టం చేశారు. పర్యాటకులను కూడా ఈ కేంద్రం విశేషంగా ఆకర్షిస్తుందని తెలిపారు.