నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్కు వినతిపత్రం సమర్పణ
చేగుంట/నార్సింగి,(విజయక్రాంతి): మెదక్ జిల్లా, నార్సింగ్ మండలం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (టీజీఈ జేఏసీ) పిలుపు మేరకు శుక్రవారం నార్సింగి మండల కేంద్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తహశీల్దార్ గ్రేసీ బాయి, ఆర్ఐ శ్రీధర్లకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీ లోపు పీఆర్సీ అమలు చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ (ఓపిఎస్) విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న డీఏ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, హెల్త్ కార్డుల అమలుతో పాటు వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, వైద్య సిబ్బంది మరియు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






