06-06-2025 12:47:22 AM
చర్ల, జూన్ 5 (విజయక్రాంతి): తెలంగాణలోని చర్ల మండలానికి సరిహద్దులో ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత సుధాకర్(67) మృతిచెందారు. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కేంద్ర కమిటీ సభ్యుడు గౌతమ్ అలియాస్ సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పప్పారావు, మరికొందరు మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయి.
వారు అటవీ ప్రాంతానికి చేరుకున్న వెంటనే మావోయిస్టులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. దీంతో సైనికులు ప్రతిదాడికి దిగా రు. ఈ కాల్పుల్లో ఓ జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. భద్రతా దళాలు, మావోయి స్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత సుధాకర్(67) మృతిచెందారు. సుధాకర్పై రూ.కోటి రివార్డు ఉంది.
ఈ ఆపరేషన్లో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు ఏకే47 రైఫిల్స్ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్కౌంటర్ స్థలం నుంచి తప్పించుకున్న ఇతర మావోయిస్టుల కోసం ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా మే 21న జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి బసవరాజు మరణించిన తర్వాత కేంద్ర కమిటీ మెంబర్ సుధాకర్ మరణం మావోయిస్టు పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.
సుధాకర్ ప్రస్తానం
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా, చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం లో సుధాకర్ జన్మించారు. తండ్రి పేరు రామకృష్ణ నాయుడు. అసలు పేరు నరసింహచలం అలియాస్ గౌతమ్ అలియాస్ సుధాకర్ అలియాస్ ఆనంద్ అలియాస్ చంటి బాలకృష్ణ అలియాస్ రామరాజు అలియాస్ అరవింద్ అలియాస్ సోమన్న మరి కొన్ని పేర్లతో చెలామణి అయ్యేవాడు.
సుధాకర్ అనేక మంది అమాయక గిరిజనుల మరణానికి, భద్రతా దళ సిబ్బంది బలిదానానికి దారితీసిన అనేక హింసాత్మక సంఘట నలకు కారకుడిగా ఉన్నట్టు తెలిసింది. ప్రస్తు తం మావోయిస్టు పార్టీలో విద్యా విభాగానికి ఇన్చార్జిగా ఉన్నారు.