దంతెవాడ- బీజాపూర్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్
ఒక మావోయిస్టు మృతి
చర్ల, మార్చి 5 (విజయక్రాంతి): ఛత్తీస్గఢ్లోని దంతవాడ బీజాపూర్ జిల్లాలోని సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో బైరంగడ్ ఏరియా కమిటీ సభ్యుడు పూనం రాజేష్ అలియాస్ రాజీవ్ పూనెం మృతి చెందాడు. గీడం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్ల నార్, గిర్సాపార, నెలగోడ గ్రామా ల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సామగ్రి, ఆయుధాలు కలిగి ఉన్నట్లు సమాచారం అందడంతో దంతేవాడ పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (నక్సల్స్ ఆప్స్) రాహుల్ కుమార్ ఉయ కే నాయకత్వంలో ఎన్కౌంటర్ నిర్వహించారు.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో రెండు వైపుల నుంచి కాల్పు లు కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతం నుంచి మృతదేహంతో పాటు ఇన్సాస్ ఎస్ ఎల్ ఆర్ రైఫిలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కార్యక్రమంలో డీఆర్జీ బస్టర్ ఫైటర్స్ ఆపరేషన్ నిర్వహించారు.




