12 June, 2026 | 12:34 PM

Breaking News

నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి

12-06-2026 11:42 AM

తండ్రి,కూతురు కొడుకు మృతి..   

మృతదేహాలను వెలికి తీసిన నిజాంసాగర్ పోలీసులు..       

నిజాంసాగర్ జూన్ 12(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జలాశయంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో చెందిన బోయి కృష్ణ తన కూతురు అన్యోన్య,కొడుకు రక్షిత్ తో నిజాంసాగర్ వద్దకు వచ్చి విహరించారు. వారితో భోజనాలు చేసిన తర్వాత గురువారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి దూకి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నది.