30-06-2025 02:10:36 AM
క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
చేవెళ్ల, జూన్ 29: గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నామని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆదివారం షాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ క్రీడ మైదానంలో ఏఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ ఎలుగంటి అభిరామ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షాబాద్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్ను ఎమ్మెల్యే కాలె యాదయ్య , జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు యువతలో శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచుతాయని చెప్పారు. ఈ టోర్నమెంట్ స్థానిక క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పిస్తుందని, ఏఎంఆర్ ట్రస్ట్ క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ షాబాద్ దర్శన్ , గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ ,మాజీ జెడ్పిటిసి గోపాల్ రెడ్డి , పీఏసీఎస్ చైర్మన్ ప్రతాపరెడ్డి , చంద్రా రెడ్డి , ఎంపీటీసీలు గుండాల అశోక్ , కుమ్మరి చెన్నయ్య ,రామ్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.