30-06-2025 02:11:55 AM
రాజేంద్రనగర్, జూన్ 29: మన దేశ త్రివిధ దళాల పోరాటానికి చిహ్నంగా కాలనీకి సింధూర్ అనే పేరు పెట్టినట్లు మైలా ర్దేవ్పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డివిజన్ లోని లక్ష్మీ గూడ వాంబే కాలనీ లో నూతనంగా నిర్మించిన సింధూ ర్ కాలనీ ఆవిష్కరణ బోర్డు ను స్థానికులతో కలిసి ఆయన ఆదివారం ఆవిష్క రించారు. స్థానికంగా ఆయన అభివృద్ధి పనులు చేపట్టినందుకు కృతజ్ఞతగా సత్కరించారు.
అనంతరం తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారతదేశం సుస్థిర అభివృద్ధి సాధిస్తుందన్నారు. త్రివిధ దళాల వీర పోరాటానికి చిహ్నంగా కాలనీకి సింధూర్ అని నామకరణం చేసినట్లు వివరించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో అడికే జనార్ధన్, సుబ్బారెడ్డి, మనీష్ తివారి, మధుసూదన్ రెడ్డి, ఉజ్వల్, అడికే శివ, సంతోష్, శ్రీధర్ రెడ్డిపాల్గొన్నారు.