18 April, 2026 | 10:45 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ముస్సోరీలో ముగించారు

21-06-2025 02:19 AM

చిరంజీవి 157వ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మెగాస్టార్ సరసన కథానాయికగా నయనతార నటిస్తుండగా.. వీటీవీ గణేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో చిరంజీవి తన అసలు పేరైన శివశంకర్ ప్రసాద్‌గా కనిపించనున్నారు. షైన్‌స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

తాజాగా మేకర్స్ ముస్సోరీ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతారపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు ‘మెగా157’గా ప్రచారంలో ఉంది. ఈ సినిమా సంక్రాంతి కానుగా 2026 జనవరిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; డీవో పీ: సమీర్‌రెడ్డి; ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్; ఎడిటర్: తమ్మిరాజు.