calender_icon.png 16 July, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత

19-06-2025 12:00:00 AM

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య 

చేవెళ్ల, జూన్ 18 : పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సూచించారు. 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం శంకర్పల్లిలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు తడి, పొడి చెత్త వేరు చేయడం, హోం కంపోస్టింగ్ పై చిత్రలేఖనం, రంగోలి, వ్యాసరచన పోటీల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరై మాట్లాడారు.

100 రోజుల ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై శుభ్రత, పరిశుభ్రతను పాటిస్తూ పరిసరాలను క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు శుభ్రత, స్వచ్ఛతపై అవగాహన పెంచుకోవాలన్నారు. పోటీల్లో 100 మంది విద్యార్థులు పాల్గొనగా, ప్రతిభ కనబర్చిన 15 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే యాదయ్య బమతులు అందజేశారు.

కార్యక్రమంలో శం కర్పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేశ్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ శోభారాణి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మీప్రవీణ్కుమార్, సీఐ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మేనేజర్ వి.అంజన్ కుమార్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ బి.ఆనంద్, ఉపాధ్యాయులు, సిబ్బందిపాల్గొన్నారు.