06-06-2025 12:00:00 AM
నిర్మల్ జూన్ 5(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని దివ్య నగర్ కాలనీలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా అధికారులతో కలిసి మొక్కలు నాటారు.
నాటిన మొక్కలను సం రక్షించాలని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ఎంపీ నగేష్
అదిలాబాద్: ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని ఎంపీ గో డం నగేష్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన స్వగ్రామమైన బజార్హత్నూర్ మండలం జాతర్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మొక్క లు నాటారు.
సహకార సంఘం చైర్మన్ వెంక న్న, మాజీ జడ్పీటీసీతాటిపల్లి రాజు, అల్కే గణేష్, సూది నందు, అడ్వకేట్ రాములు, వినాయక్ చంద్రకాంత్ వెంకటస్వామి మాజీ సర్పంచ్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.