calender_icon.png 27 June, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమష్టి కృషితో మాదకద్రవ్యాల నిర్మూలన

27-06-2025 01:49:58 AM

జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ.. హాజరైన ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ 

జగిత్యాల, జూన్ 26 (విజయక్రాంతి): సమాజాన్ని నాశనం చేసే మా దకద్రవ్యాల నిర్మూలన అన్ని వర్గాల ప్రజల సమిష్టి కృషితోనే సాధ్యమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ మా దక ద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు.

మున్సిపల్ పార్క్ నుండి మినీ స్టడియం వరకు సాగిన ర్యాలీలో ’మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తు అంధకారం చేసుకోకూడదు’ అంటూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ప్రతిజ్ఞ చేసి, యాంటి డ్రగ్స్ సోల్జర్’గా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ మా ట్లాడుతూ సమాజంలో జరుగుతున్న చాలా నేరాలు మత్తు పదార్థాలకు బానిసైన వారు చేసినవేనని పేర్కొన్నారు. మత్తు పదార్థాలు ఉపయోగించడం ద్వారా యువత తమ ఉజ్వల భవిష్యత్తుని కోల్పోతున్నారని, యుక్త వయసులో తెలిసి తెలియక వివిధ ప్రభావాల వల్ల చెడు అలవాట్లకు ఆకర్షితులయ్యే అవకాశం ఉందన్నారు. 

చెడు అలవాట్లను దూరం చేసుకుంటేనే ఉన్నత స్థాయికి రాగలుగుతా రన్నారు. డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు భవిష్యత్ లేకుండా చేస్తుందనే విషయాన్ని యువత గ్రహించి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాలపై అవగాహన కల్పించి, వాటి వినియో గం వల్ల కలిగే నష్టాలపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీస్ కళాబృందం జిల్లాలో ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత, జిల్లా సంక్షేమాధికారి నరేష్, డివిజన్, మండల స్థాయి అధికారులుపాల్గొన్నారు.