27-06-2025 01:50:51 AM
దళిత గిరిజన ఆదివాసి జేఏసీ
ఖైరతాబాద్, జూన్ 26 (విజయక్రాంతి) : అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని స్థానిక సంస్థల ఎన్నికల లోపు అమలు చేయాలని దళిత గిరిజన ఆదివాసి జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు బొం కూరి సురేందర్ సన్ని అధ్యక్షతన అంబేద్కర్ అభయాసం సాధనకై చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్పై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి మహా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు నర్సింగరావు,భారత ఎరుకుల కులవృత్తుల సంఘం వ్యవస్థాపణ ఇధ్యక్షులు కండెల వెంకటేశ్వర్లు, టి పి కే ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండు, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గంధం రాములు తదితరులు హాజరై మాట్లాడారు.. తెలంగాణ దళిత, గిరిజన ఆదివాసి ఉద్యమకారులకు 250 గజాల స్థలం తో పాటు ఇంటి నిర్మాణ నికి రూ 25 లక్షలు అందజేయాలని కోరారు.
దళి తబందు అబ్దిదారుల ఖాతాల్లో ఫ్రీజింగ్లో ఉన్న డబ్బులను ఆయా కుటుంబాలకు చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సి, ఎస్టి డిక్లరేషన్లో ప్రకటించిన 12 అంశాలను వెంటనే అమలు చేయాలని కోరారు. అంబేడ్కర్ అభయహస్తం పథకాన్ని అమలు చేయకపోతే దళిత, గిరిజన ఆదివాసీ ప్రజలను ఏకం చేసి పోరాడుతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో టి ఎమ్ ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఇటుకరాజు మాదిగ, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు జున్ను కనకరాజు, బిఎల్ఎఫ్ రాష్ట్ర ఇన్వీనర్ వనం సుధాకర్, ఎరుకల సంఘం నేతలు వనం గంగయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.