06-06-2025 12:16:12 PM
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరయ్యారు. బీఆర్కే భవన్ లో ఎంపీ ఈటలను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ ఆర్థికమంత్రిగా పనిచేశారు. గతంలో నిర్వహించిన బాధ్యతల ఆధారంగా కమిషన్ ఈటలను ప్రశ్నించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు, ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ ఈటల రాజేందర్(Eatala Rajendar) ను ప్రశ్నించనున్నారు. కాళేశ్వరం రీ-ఇంజినీరింగ్, డిజైన్, నిధుల విడుదల, కాళేశ్వరంపై కేబినెట్ ఆమోదం సహా అనేక అంశాలపై ప్రశ్నించే అవకాశముంది. హరీశ్ రావు జూన 9న కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) హాజరు కానున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటివరకు 109 మందిని ప్రశ్నించిన విషయం తెలిసిందే.