6 May, 2026 | 9:21 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

జనావాసాలకు దూరంగా ఇథనాల్ పరిశ్రమ ఉండాలి

28-11-2024 01:23 AM

బీజేఎల్పీ నేత  మహేశ్వర్‌రెడ్డి డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సమస్యపై గుండంపల్లి రైతులతో చర్చించి న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. దిలావర్‌పూర్ జేఏసీతో ఈ అంశంపై ఇప్పటికే రెండుసార్లు చర్చించామన్నారు.

సమస్యను సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లామని.. పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించే వరకు పోరాటం చేస్తామన్నారు. పోలీసు అధికారులు రైతులపై కేసులు పెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.