07-06-2025 01:24:50 AM
జగిత్యాల అర్బన్, జూన్ 6 (విజయ క్రాంతి): అర్హులైన ప్రతి చిన్నారి బడిలో ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.‘బడిబాట, పాఠశాలల పున ప్రారంభం‘ పై శుక్రవారం జిల్లా కలెక్టర్ మండల విద్యాధికారులతో సమావేశం నిర్వహించారు.
2025 -2026 విద్యా సంవత్స రం ఆరంభానికి ముందుగానే జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల జిల్లా అధికారులకు, సమస్త మండల విద్యాధికారులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆధ్వర్యంలో పాఠశాల సన్నద్ధత, బడిబాటలో అమలు చేయవలసిన చర్యలను వివరించారు.
అన్ని గ్రామాలలో పాఠశాలను ఇప్పట్నుండే పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, పాఠశాలలో మౌలిక వసతులు ,తరగతి గదులు , త్రాగునీటి వసతులు ,టాయిలెట్ శుభ్రత , వంటగదుల శుభ్రత , వంట సరుకుల నాణ్యత లాంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశానికి జిల్లా విద్యాధికారి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, మండల విద్యాధికారులు , జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు కార్యాలయ సిబ్బందిపాల్గొన్నారు.