25-06-2025 01:03:12 AM
దేవరకొండ, జూన్ 24: గొర్రెల మేకల షెడ్ లోనీ గొర్రెలను వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతర్ జిల్లా నిందితులను మంగళవారం కొండమల్లేపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల కొండమల్లేపల్లి, నాంపల్లి,గుర్రంపోడు మండలాల్లో వరుస గొర్రెల, మేకల దొంగత నాలకు పాల్పడిన నలుగురు అంతర్ జిల్లా నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
నాలుగు కేసులలో కలిపి 32 గొర్రెలను, మేకలను నిందితులు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని అలాగే వీరి వద్ద నుంచి రెండు లక్షల ఇరవై వేల రూపాయలను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు కొండమల్లేపల్లి ఇన్చార్జి సిఐ రాజు తెలిపారు. ఇట్టి కేసును ఛేదించిన కొండమల్లేపల్లి ఎస్త్స్ర అజ్మీర రమేష్ నాయక్, ఐడి పార్టీ సిబ్బంది హేము నాయక్,భాస్కర్, నవీన్ రెడ్డి లను ఇంచార్జ్ సిఐ అభినందించారు.