09-12-2025 02:31:20 AM
ఫీనిక్స్ పక్షి స్ఫూర్తితోనే తెలంగాణ రైజింగ్కు శ్రీకారం
మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, దానిని నిర్మించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. మేం వేసే ప్రతి అడుగు... చేసే ఆలోచన భావితరాల ఆశయాలు, అవసరాలకు అనుగుణంగా రేపటి తెలంగాణ కోసమే అని వివరించా రు. ఫీనిక్స్ పక్షి స్ఫూర్తితో ఇన్నోవేషన్, హ్యూమ న్ క్యాపిటల్, సస్టైనబులిటీ, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా తెలంగాణను మార్చాలనే లక్ష్యంతోనే తెలంగాణ రైజింగ్కు శ్రీకారం చుట్టామన్నా రు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదురవు తున్న ఎకనామిక్ రీ అలైన్మెం ట్స్, టెక్నలాజికల్ డిస్రప్షన్, క్లైమేట్ అన్సెర్టెనిటీ లాంటి సవాళ్లను అవకాశాలుగా మార్చుకొని 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేందుకు దార్శనికతతో కూడిన అడుగులు వేస్తున్నామన్నారు. ఈ ప్రయాణంలో వేసిన తొలి అడుగు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 అని అన్నారు. భౌగోళిక విస్తీర్ణం, జనాభాలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చిన్నదే అయినా దేశ జీడీపీలో మాత్రం 5 శాతం వాటాను కలిగి ఉందన్నారు.
2024-2025లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 10.1 శాతం కాగా, జాతీయ సగటు 9.9 శాతంగా నమోదు అయ్యిందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.79 లక్షలు, జాతీయ సగటు కంటే 1.8 రేట్లు ఎక్కువ అని వివరించారు. రాష్ట్ర ఇండస్ట్రియల్, మాన్యుఫ్యాక్చరింగ్ ఎకానమీ వృద్ధి రేటు 7.6 శాతం కాగా, జాతీయ సగటు 6.6 శాతం మాత్రమే అన్నారు. రాష్ట్ర సేవల రంగం వృద్ధి రేటు 11.9 శాతంగా కాగా, అదే జాతీయ సగటు 10.7 శాతంగా ఉందన్నారు.
రాష్ట్ర ఇండస్ట్రియల్ జీఎస్ వీఏ 12.6 శాతం వృద్ధి రేటుతో రూ.2.46 లక్షల కోట్ల నుంచి రూ.2.77 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. మాన్యుఫ్యాక్చరింగ్, కన్ స్ట్రక్షన్, మైనింగ్, క్వారీయింగ్, ఎలెక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్, ఇతర యుటిలిటీస్ లాంటి ఇండస్ట్రియల్ సబ్ సెక్టార్లలోనూ తెలంగాణ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదు కావడం తమ ప్రభు త్వ పనితీరుకు నిలువెత్తు నిదర్శనమన్నారు.