calender_icon.png 26 June, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరి కృషి అవసరం

26-06-2025 05:02:03 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, మత్తు పదార్థాల వినియోగం, రవాణాపై అప్రమత్తంగా ఉంటూ నిరోధానికి సంఘటిత కృషి అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh), ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, ఎక్సైజ్ సూపర్డెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, డీఎస్పీ తిరుపతిరావు పాల్గొన్నారు. 

భూపాలపల్లిలో..

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ క్రీడా ప్రాంగణం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్.రమేష్ బాబు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. నాగరాజు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్సార్. దిలీప్ కుమార్ నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జీ.అఖిల, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.