calender_icon.png 19 June, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి

18-06-2025 06:50:54 PM

వాజేడు (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి భాగస్వాములు కావాలని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల వాజేడు నాగారం ప్రధానోపాధ్యాయులు సోయం ఆనందరావు(Principal Soyam Anand Rao) అన్నారు. పాఠశాలలో గల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించారు. బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి 65 పండ్ల, పూల మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు సూచన చేస్తూ ప్రతి విద్యార్థి తన పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఒక మొక్కను నాటి వాటిని రక్షించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఈ మొక్కలను స్థానిక గ్రామపంచాయతీ నర్సరీ నుండి సరఫరా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కోరిక స్వరూప్ సింగ్, చల్లగురుగుల మల్లయ్య, రంగు ఆనందు, శ్రీకాంత్, బొగ్గం కుమార్, కంచు ప్రభాకర్, తెల్లం రాజ్యలక్ష్మి, షిండే రాజేష్, అట్టం అమ్మాజీ రాణి, జరుపుల వస్య తదితరులు పాల్గొన్నారు.