27-05-2025 06:14:26 PM
ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలి..
ఆయుష్ డాక్టర్ తన్నీరు రాంప్రసాద్..
పెన్ పహాడ్: అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) పురస్కరించుకొని ఈనెల 27 నుంచి జూన్ 21 వరకు తలపెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్య దిశగా ప్రతి పౌరుడు యోగాభ్యాసం పెంపొందించే లక్ష్యంగా ముందుకెళ్లాలని.. అందులో భాగంగానే 'ఒకే భూమి.. ఒకే ఆరోగ్యం కోసం యోగ' కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయుర్వేదిక్ డాక్టర్ తన్నీరు రాంప్రసాద్(Ayurvedic Doctor Thanniru Ramprasad) కోరారు.
మంగళవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఆశా వర్కర్లకు ఏర్పాటుచేసిన కామన్ యోగ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈనెల 27 నుంచి వచ్చేనెల 21 తేదీ వరకు ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమాలు తలపెట్టినట్టు ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పౌరుల్లో యోగబ్యాసాన్ని పెంపొందించే లక్ష్యంగా ఈ కార్యక్రమం తలపెట్టినట్లు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు, యోగా బోధకులు సుదర్శన్ రెడ్డి, మమత పాల్గొన్నారు.