7 April, 2026 | 3:02 PM

Breaking News

వలసదారులకు కేంద్రం ఊరట: 5 కిలోల సిలిండర్ల కేటాయింపు రెట్టింపు   •   నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: విద్యుత్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా— ఇద్దరు మృతి   •   హైదరాబాద్‌లో కలకలం... కూకట్‌పల్లి JNTUకు బాంబు బెదిరింపు   •   పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులే రాజులు   •   ఆన్ లైన్ పద్దతిలోనే జిల్లాలో ఇసుక రవాణా జరగాలి   •   మల ద్వారంలో పెట్టిన పైపు.. మృతి చెందిన యువకుడు!   •   విద్యార్థులు మంచినీటిని సద్వినియోగం చేసుకోవాలి   •   సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో చిరుత పులి దాడి   •   బార్యాభర్తల వివాదాల పరిష్కారం కోసం ఫ్యామిలీ కౌన్సెలింగ్   •   ఎంజీఎంను ఆకస్మికంగా తనిఖీ చేసిన పశ్చిమ ఎమ్మెల్యే నాయిని   •  

భూగర్భజలాల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

15-04-2025 09:59 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువన్..

కామారెడ్డి (విజయక్రాంతి): భూగర్భజలాల సంరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అసిస్ సంఘం అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో భూగర్భజలాల సంరక్షణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో భూగర్భ జలాలు చాలా వేగంగా పడిపోతున్నాయి, రాబోయే ఎండాకాలంలో భూగర్బజలాల సంరక్షణ కోసం ఫాం పాండ్స్, బోరేవెల్ రీఛార్జ్ స్ట్రక్చర్, ఇంకుడు గుంతలు, సోక్ పిట్స్ ఎక్కువ నిర్మించాలని అన్నారు. వచ్చే వర్షకాలంలో ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టి భూమిలోకి ఇంకేలాగా దానికి తగిన విధంగా యాక్షన్ ప్లాన్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టరు చందర్ నాయక్, జిల్లా భూగర్భ జల అధికారి సతీష్ యాదవ్, పీడీ సురేందర్, రాజేందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా ఉద్యాన అధికారిణి జ్యోతి, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.