calender_icon.png 7 June, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

05-06-2025 10:36:29 PM

జూనియర్ సివిల్ జడ్జి ఎండి గౌస్ పాషా..

తుంగతుర్తి (విజయక్రాంతి): అంతర్జాతీయ ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World Environment Day) సందర్భంగా తుంగతుర్తి జూనియర్ సివిల్ జడ్జి ఎండి గౌస్ పాషా(Junior Civil Judge MD Ghouse Pasha) కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ... మొక్కలను పరి రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి కాబట్టి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో విధిగా మొక్కలు నాటి సంరక్షించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అధ్యక్షులు అన్నపర్తి జ్ఞాన సుందర్ ఉపాధ్యక్షులు కారింగుల వెంకటేశ్వర్లు సిఐలు నరసింహారావు రఘువీర్ రెడ్డి మొక్కలు నాటారు కార్యక్రమంలో న్యాయవాదులు రణధీర్ రాజారామ్ రవికుమార్ వజీర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు