05-06-2025 10:32:41 PM
కోదాడ: నియోజకవర్గ కేంద్రమైన కోదాడ బస్టాండ్ అపరిశుభ్రతతో దుర్గందం వెదజల్లుతుంది. వందలాది మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు కొనసాగించే కోదాడ బస్టాండ్ ఆవరణం అపరిశుభ్రంగా మారి దుర్వాసన వెదజల్లుతుంది. ఆవరణంలో నీరు నిల్వ ఉండి దోమలు చేరి దుర్గంధం వెదజల్లుతుంది. దీంతో ప్రయాణికులు ముక్కు మూసుకుని ఉండాల్సిన పరిస్థితి. ఇటీవల కురిసిన వర్షపు నీరుతో పాటు, బస్టాండ్ వెలుపల వైపు నుండి వస్తున్న నీరు చేరి చిన్నపాటి చెరువును తలపిస్తుంది. అంతేకాకుండా బస్టాండ్ ఆవరణంలో పందులు సంచరించుతూ ఉండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి నిల్వ ఉన్న నీటిని తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.