calender_icon.png 7 June, 2025 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని నరేంద్ర మోడీతోనే దేశంలో సుపరిపాలన

05-06-2025 10:39:15 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) నాయకత్వంలో సుపరిపాలన సాగుతోందని, ఫలితంగా 11 సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచంలో నాలుగవ స్థానానికి చేరుకుందని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోలీ మధుసూదన్ రెడ్డి(Former BJP Kisan Morcha state president Goli Madhusudhan Reddy) అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

వచ్చే స్థానిక, మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఒద్దిరాజు రామచందర్రావు, శ్యాంసుందర్ శర్మ, చీకటి మహేష్ గౌడ్, గడ్డం అశోక్ కుమార్, పొదిల నరసింహారెడ్డి, సందీప్ కుమార్, పద్మ, పాపారావు, జయేందర్, రాజు, ఉప్పునూతల రమేష్, కిషన్, నరేష్ నాయక్, సరోజిని, భరత్ పాల్గొన్నారు.