25 March, 2026 | 3:05 AM

భగత్‌సింగ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

25-03-2026 12:55 AM

సీపీఎం మండల కార్యదర్శి శంకర్ రెడ్డి

నూతనకల్, మార్చి 24: భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలో యువశక్తిని మేల్కొల్పిన మహా విప్లవకారుడు భగత్ సింగ్ అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని సీపీఎం మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని వెంకపల్లి గ్రామంలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శమని శంకర్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బత్తుల జనార్ధన్, చూడి మధుసూదన్ రెడ్డి, తొలుకునూరి ఉప్పలయ్య, శ్రీను, శ్రీరంగం లక్ష్మయ్య, చంద్రయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.