08-12-2025 01:12:58 AM
గ్లోబల్ సమ్మిట్కు ప్రతిష్ఠాత్మక ఏర్పాట్లు
హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపా ధి కల్పించటమే లక్ష్యంగా నిర్వహించనున్న రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ సదస్సులో 44పైగా దేశాల నుంచి154 మంది అంతర్జాతీ య ప్రతినిధులు హాజరవుతున్నారు.
విశ్వవాప్తంగా పేరెన్నికగల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నాయి. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. నేటి మధ్నాహ్నం 1.30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ సమ్మిట్ను ప్రారంభిస్తారు. సుమారు 2 వేల మంది దేశ, విదేశీ అతిథులు ప్రారంభవేడుకకు హాజరవుతున్నారు.
సమ్మిట్లో వివిధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా- టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్తుడ ర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈవో జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్-షా తదితరులు ప్రసంగించను న్నారు. మధ్యా హ్నం 2.30 గంటలకు సీఎం రేవంత్రెడ్డి ప్రసంగిస్తారు.
తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశా లు, ప్రభుత్వం వైపు నుంచి అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై సీఎం ఆహూతులకు వివరిస్తారు. రెండు రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్లు జరుగుతాయి. ఇందుకు వీలుగా సెమినార్ హాళ్లను అధికారులు సిద్ధం చేశారు. వచ్చిన అంతర్జాతీయ, దేశీయ అతిథులు, పెట్టుబడిదారులకు తెలంగాణతో పాటు హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రచార సామగ్రిని సిద్ధం చేశారు.
ఎయిర్పోర్టు నుంచి ప్యూచర్ సిటీ వరకు వివిధ రూపాల్లో ప్రదర్శన
ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలో వేదిక వరకు వివిధ రూపాల్లో ప్రచార సామ గ్రి ప్రదర్శన ఉంటుంది. అలాగే హైదరాబా ద్ వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతో ప్రత్యేకంగా ప్రచార ఏర్పాట్లు చేశారు. లైటిం గ్ ప్రొజెక్షన్, 3డీ ప్రాజెక్షన్ మ్యాపింగ్, ఎయి ర్ పోర్టు అప్రోచ్ రోడ్లో ఎల్ఈడీ స్క్రీన్స్ తో ఈ విభిన్న ప్రదర్శనలు ఉంటాయి. సబ్జెక్టులపై చర్చల తర్వాత ప్రముఖ సంగీత డైరెక్టర్ కీరవాణి సంగీత కచేరి అతిథులను అలరించనుంది.
కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గుడోలు, బోనాల ప్రదర్శనలు
తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సా డీ, ఒ గ్గుడోలు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉం టుంది. మరోవైపు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీ మ్ పార్కు.. బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజంశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్ బిర్యానీతో పాటు ప్రత్యేక వంటకాలు
సదస్సు జరిగే రెండు రోజుల పాటు హాజరైన అందరికీ పసందైన హైదరాబాదీ బిర్యా నీతో పాటు, తెలంగాణ ప్రసిద్ధ వంటలతో భోజనాలను అందించేందుకు వంటశాలలు సిద్ధమయ్యాయి. ఇక అతిథులకు తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్లోబల్ సమ్మిట్ డెలిగేట్లకు ప్రత్యేక సావనీర్లకు కూడిన బహుమతిని ప్రభుత్వం తరఫున అం దించనున్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగో తోపాటు, పోచంపల్లి ఇక్కత్ శాలువా, చేర్యాల కళాకృతులు, హైదరాబాదీ అత్తర్, ముత్యాలతో కూడిన నగలను ఈ సావనీర్లో పొందుపరుస్తారు. అలా గే తెలంగాణకే ప్రత్యేక వంటలైన ఇప్ప పువ్వు లడ్డు, సకినాలు, చెక్కలు, బాదం కీ జాలి, నువ్వుల ఉండలు, మక్క పేలాలతో కూడిన మరో ప్రత్యేక బాస్కెట్ను కూడా అతిథులకు అం దించనున్నారు.