calender_icon.png 12 June, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం కమిషన్ విచారణకు బయల్దేరిన కేసీఆర్

11-06-2025 10:27:56 AM

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు(Kalvakuntla Chandrashekar Rao) సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం(KCR Erravalli farm) నుంచి కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. బీఆర్కే భవన్ లో మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరుకానున్నారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు విచారణ ప్రారంభమయ్యే కానుంది. కేసీఆర్ ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghose Commission) విచారించనుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు.  పోలీసులు కార్యకర్తలను అదుపు చేస్తూ బందోబస్తు చేపట్టారు. కేసీఆర్ తో పాటు బీర్కే భవన్ లోకి 9 మంది నేతలకు అనుమతిచ్చారు.

కేసీఆర్ తో పాటు పాటు బీఆర్కే భవన్ కు హరీశ్ రావు(Harish Rao), ప్రశాంత్ రెడ్డి, పద్మారావుగౌడ్, మహమూద్ అలీ, వద్దిరాజు రవిచంద్ర, మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్లనున్నారు. ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వలపై ప్రశ్నించే అవకాశముంది. ఇప్పటికే ఈటల రాజేందర్(Etela Rajender), హరీశ్ రావును పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. ఇప్పటివరకు 144 మందిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. ఈ నెల 6న ఈటల రాజేందర్, మొన్న హరీశ్ రావును పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. కమిషన్ విచారణ దృష్ట్యా మొన్న, నిన్న హరీశ్ రావు తో కేసీఆర్ వరస భేటీలు అయ్యారు. కేసీఆర్ విచారణ సందర్భంగా కార్యకర్తలు భారీగా తరలి వచ్చే అవకాశముంది.