11-06-2025 10:48:11 AM
చర్ల,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ లో కష్టపడ్డ వారికి ఫలితం దక్కుతుందనీ అనడానికి నిదర్శనం చర్ల మండలానికి చెందిన నల్లపు దుర్గాప్రసాద్ నిదర్శనం. సోమవారం టిపిసిసి నుండి 69 మంది సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం పార్టీ ప్రధాన కార్యదర్శులుగా నియమించిన విషయం విధితమే. ఈ నియామకాల్లో వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీలకు సరైన ప్రాతినిధ్యాన్ని కల్పించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా(General Secretary of Telangana Pradesh Congress Committee) నల్లపు దుర్గాప్రసాద్ కు స్థానం దక్కింది. చర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
నల్లపు దుర్గాప్రసాద్ రాజకీయ ప్రస్థానం
చర్ల మండలంలో రాజకీయ చక్రాన్ని అలఒకగా నడిపించిన ఒకే ఒక వ్యక్తి నల్లపు దుర్గాప్రసాద్ అని చెప్పవచ్చు చర్ల మండలంలో ఎన్ ఎస్ యూ ఐ కార్యదర్శిగా అడుగులు వేసి రాజకీయ రంగంలో ప్రవేశించి మండల స్థాయిలో యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా అనంతరం సుదీర్ఘంగా 14 సంవత్సరాల పాటు మండల ప్రెసిడెంట్ గా పనిచేసి, 2006-2009 వరకు మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవి అలంకరించారు. ఆ సమయం లోనే ఎమ్మెల్యే సత్యవతి ఆధ్వర్యంలో బి బ్లాక్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు, అంతరం కాంగ్రెస్ పార్టీలో మండల స్థాయి లో ఇన్చార్జిగా పనిచేశారు , పినపాక, ఇల్లందు, వైరా ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్చార్జిగా కొనసాగారు. వైరా నియోజకవర్గ లో పార్టీ సభ్యత్వాల ఇన్చార్జిగా తన పని తరం చూపించారు.
మధిర బి బ్లాక్ మండల కమిటీలలో గ్రామ కమిటీలలో ఇన్చార్జిగా పని చేశారు, మునుగోడు ఉప ఎన్నికలలో మేజర్ పంచాయతీ గ్రామమైన పొరిటికల్ గ్రామంలో ఎన్నికల ఇన్చార్జిగా సమర్థవంతంగా పని చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న విజయం సాధించడానికి భద్రాచలం ఎన్నికల ఇన్చార్జిగా కీలకంగా బాధ్యతలు తీసుకున్నారు, ఎంపీ ఎన్నికలలో సైతం భద్రాచలం ఎన్నికల ఇన్చార్జిగా పనిచేసి తన పనితనం చూపించి పోరిక బలరాం నాయక్ విజయం వెనుక తాను ఒక సమిధ గా పనిచేశారు,ఇలా పలు బాధ్యతలు తీసుకొని పార్టీలో కల్మషం లేని నిస్వార్ధమైన సమర్థవంతమైన విధి నిర్వహణ చేశారు, రాష్ట్రస్థాయిలో టిపిసిసి సభ్యులుగా కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన 69 మంది ప్రధాన కార్యదర్శులలో చర్ల మండలానికి చెందిన వ్యక్తిగా నల్లపు దుర్గాప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి స్థానం దక్కించుకున్నారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ముగ్గురు ప్రధాన కార్యదర్శులుగా ఎంపిక అవడం అందులో ధర్మ రావు, సీతరాముల , నల్లపు దుర్గాప్రసాద్ ఎంపికవటం గర్వించదగినదనీ చెప్పవచ్చు.
సదా మీ కృతజ్ఞుడను:
తనకి అవకాశం కల్పించిన పార్టీ కి పార్టీ పెద్దలు మల్లికార్జున కార్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, పోదెం వీరయ్య, తెల్లం వెంకటరావు,లకు, జిల్లాస్థాయి, డివిజన్ స్థాయి మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అనుచరులకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఈ సందర్భంగా నల్లపు దుర్గాప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.