21-11-2025 12:45:36 AM
బాయిల్డ్ రైస్ కోటా పెంచాలి.. పెండింగ్ సబ్సిడీ విడుదల చేయాలి
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి) : తెలంగాణలో అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతమైందని, దేశమంతటా ఈ పథకా న్ని విస్తరించాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరా రు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని సీఎం వివరించారు. దీంతో పీడీఎస్ బియ్యం రీ సైక్లింగ్ తగ్గిందని, బహిరంగ మార్కెట్లో నూ ధరలు స్థిరపడ్డాయని చెప్పారు.
ప్రజ లు తినే బియ్యాన్ని పంపిణీ చేయటంతో ఈ పథకం ఆశించిన లక్ష్యం నెరవేరిందని అన్నారు. తెలంగాణ లాగే కేంద్ర ప్రభు త్వం కూడా దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ అంశంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి అన్నారు. గురువారం హైదరాబాద్కు వచ్చిన కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లా ద్ జోషితో సీఎం రేవంత్రెడ్డి భేటీ అయ్యా రు.
హోటల్ తాజ్ కృష్ణాలో జరిగిన ఈ సమావేశంలో సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సివిల్ సప్లయిస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్టీఫెన్ రవీంద్రతో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన సహకారం అందించాలని పలు అంశాలను ప్రస్తావించారు. 2024-25 రబీ సీజన్కు సంబంధించి అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కోటా పెంచాలని కోరారు.
పీడిఎస్ కింద సరఫరా చేసిన లెవీ రైస్కు సంబంధించిన రూ.1,468 కోట్ల సబ్సిడీ విడుదల చేయాలన్నారు. పీఎంజీకేఏవై అయిదో దశకు సంబంధించి పెండిం గ్లో ఉన్న రూ. 343.27 కోట్ల సబ్సిడీ విడుదల చేయాలని కోరారు. 2024-25 ఖరీఫ్ కస్టమ్ మిల్లింగ్ రైస్ వ్యవధి పొడిగించాలని కోరారు. ఎఫ్సీఐ గోదాముల్లో నిల్వ ఇబ్బందులను అధిగమించేందుకు అదనపు బాయి ల్డ్ రైస్ ర్యాక్లు కేటాయించాలని, రాష్ర్టంలో 15 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల నిల్వ సామర్థ్యం పెంచుకునేందుకు కేంద్రం సాయం అందించాలని కోరారు.
2025- 26 ఖరీఫ్లో అత్యధికంగా 148 లక్షల మెట్రి క్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని, ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని 80 లక్షల మె ట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ర్ట ప్రభుత్వ విజ్ఞప్తులన్నీ సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర మం త్రి హామీ ఇచ్చారు.
బాయిల్డ్ రైస్ అవసరం తగ్గింది
దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్ అవసరం తగ్గిందని, అందువల్ల మిల్లింగ్కు అనువైన ముడి బియ్యం రకాల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రాష్ర్టంలో మిగులు ధాన్యం నిల్వలను సమర్థంగా నిర్వహించేందుకు ఎగుమతి అవకాశాలను పరిశీలించా లని సలహా ఇచ్చారు.
ధాన్యం సేకరణ లక్ష్యా న్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని, బాయిల్డ్ రైస్ అదనపు కోటాను కేటాయించాలని రాష్ర్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ముడి బియ్యానికి అనువైన రకాల వరి సాగును ప్రోత్సహించేందుకు రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు.