31-05-2025 12:50:26 AM
ఐదుగురి మృతి.. 30 మందికి గాయాలు
ఛండీగఢ్: పంజాబ్లోని శ్రీముక్త్సర్ సాహిజ్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సింగ్వాలీ రహదారి సమీపంలోని రెండంతస్థుల భవనంలో ఉన్న బాణాసంచా ఫ్యాక్టరీలో శుక్రవారం తెల్లవారుజామున పేలుడు సంభవించిందని డీఎస్పీ జస్పాల్ సింగ్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామని, పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా ప్రమాదంలో మరణించిన వారంతా వలస కార్మికులే అని డీఎస్పీ స్పష్టం చేశారు.