calender_icon.png 13 October, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ హ్యుమానిటీస్ పై అధ్యాపక వికాస కార్యక్రమం

13-10-2025 09:30:13 PM

గీతంలో ప్రారంభమైన మూడు రోజుల కార్యక్రమం

తమ నైపుణ్యాలను పంచుకుంటున్న జాదవ్ పూర్ వర్సిటీ, ఐఐటీ ఢిల్లీ అధ్యాపకులు

పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్(జీఎస్ హెచ్ఎస్)లోని ఆంగ్లం, ఇతర భాషల విభాగం ఆధ్వర్యంలో ‘డిజిటల్ హ్యుమానిటీస్’పై నిర్వహిస్తున్న మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం(ఎఫ్డీపీ) సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. సాంప్రదాయ మానవీయ శాస్త్రాలను(హ్యుమానిటీస్) అభివృద్ధి చెందుతున్న డిజిటల్ టెక్నాలజీలతో అనుసంధానించే కీలక సాధనాలు – వచనం (టెక్ట్), శ్రవణం (ఆడియో) వంటి వాటిని డిజిటలైజేషన్ చేయడం, మెటాడేటా సృష్టి, నిర్వహణ, డేటా విజువలైజేషన్, టెక్స్ట్ విశ్లేషణలో అధ్యాపక సభ్యులకు ఆచరణాత్మక శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమ లక్ష్యం. ప్రారంభ కార్యక్రమంలో జాదవ్ పూర్ విశ్వవిద్యాలయంకు చెందిన ప్రముఖ ప్రొఫెసర్లు చాలా లోతైన, ఆలోచింపజేసే ప్రసంగాలు చేశారు. స్కూల్ ఆఫ్ కల్చరల్ టెక్స్ట్ అండ్ రికార్డ్స్ (ఎస్ సీటీఆర్) డైరెక్టర్ ప్రొఫెసర్ అభిజిత్ గుప్తా, డిజిటల్ సంరక్షణలో తన విస్తృత అనుభవాన్ని పంచుకుంటూ డిజిటైజేషన్ చేసి, వాటిని భవిష్యత్తు తరాలకు పనికొచ్చేలా సంరక్షించడం (ఆర్కైవింగ్): ఎస్ సీటీఆర్ ప్రయాణం అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు.

ఎస్ సీటీఆర్ లోని రిప్రోగ్రాఫర్ డాక్టర్ అమృతేష్ బిశ్వాస్ ‘జ్జానాన్ని సంగ్రహించడం: ఫోటోగ్రఫీ, డిజిటలైజేషన్, డిజిటల్ ఆర్కైవ్ లను నిర్మించడం’, ‘వినగల గతాన్ని కాపాడటం: సౌండ్ ఆర్కైవింగ్, డిజిటలైజేషన్’ అనే అంశాలపై చాలా విలువైన విషయాలను సదస్యులతో పంచుకున్నారు. తొలుత, జీఎస్ హెచ్ఎస్ డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ తరు స్వాగత వచనాలతో ఆరంభమైన ఈ కార్యక్రమంలో ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ సయంతన్ మండల్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఇక రానున్న రెండు రోజులలో ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ అర్జున్ ఘోష్, జాదవ్ పూర్ వర్సిటీ ఎస్ సీటీఆర్ పరిశోధక విద్యార్థిని రీసూమ్ పాల్ వంటి ప్రముఖ వక్తలు తమ నైపుణ్యం, ఆచరణాత్మక అంతర్దృష్టులను పంచుకోనున్నారు. ఈ మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని నిర్వాహకులు డాక్టర్ జోంధలే రాహుల్ హిరామన్, డాక్టర్ బనేకర్ తుషార్ వినాయక్, డాక్టర్ రెస్మి పాడియన్ ల మద్దతుతో డాక్టర్ సయంతన్ మండల్ సమన్వయం చేస్తున్నారు. గత ఏడాది డిజిటల్ హ్యుమానిటీస్ పై నిర్వహించిన అధ్యాపక వికాస కార్యక్రమానికి కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. డిజిటల్ యుగంలో విద్యా ఆవిష్కరణ, అంతర్ విభాగ నైపుణ్యాలను పెంపొందించడంలో గీతం యొక్క నిరంతర నిబద్ధతను ఈ ఎఫ్డీపీ ప్రతిబింబిస్తోంది.