13 April, 2026 | 11:54 AM

Breaking News

మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •  

ఘనంగా తెలంగాణ తొలి స్పీకర్ జన్మదిన వేడుకలు

13-10-2025 09:01 PM

హనుమకొండ (విజయక్రాంతి): తెలంగాణ మొట్టమొదటి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలను కేక్ కోసి, స్వీట్లు పంచుకొని హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. మధుసూదనాచారి జయంతి వేడుకల్లో భాగంగా హనుమకొండలోని సహృదయ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం కేయూ ఆచార్య గడ్డం భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం గడ్డం భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ తొలి స్పీకర్ మధుసూదనాచారి తెలంగాణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారన్నారు.

పేదల కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో తాళ్లపల్లి రామస్వామి గౌడ్, సురేందర్, మునీరుద్దీన్, మదర్ అసిఫ్, సాయికుమార్, మహిళలు పాల్గొని చారి సేవలను కొనియాడుతూ మరింత ఉన్నతమైన పొంది బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి పాటుపడటానికి కావలసిన ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు కల్పించాలని చారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.