17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్

31-05-2025 12:15 AM

పాల్గొన్న టీజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సదాశివపేట,మే 30 : రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం సదాశివపేటలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

ఎంతో మంది నిరుపేదలు వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారు ఉచిత మెగా క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ క్యాంపులో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్, డయాబెటిస్, బీపీ, జనరల్ హెల్త్ కి సంబంధించి మొత్తం 320 కి పైగా రోగులకు వైద్యం అందించారు. 320 సభ్యులలో  52 మందికి క్యాన్సర్ కోసం స్కానింగ్ చేశారు. 

110 మందికి కార్డియాలజిస్ట్ టెస్టు, 158 మందికి జనరల్ వైద్యాన్ని అందించారు. అందరికీ ఉచితంగా మందులు  అందించారు. ఈ మెగా హెల్త్ క్యాంప్ లో పాల్గొన్న వారందరికీ ఓదెల ఈశ్వరయ్య ఫౌండేషన్ వారి తరఫున భోజనం అందించారు.

కార్యక్రమంలో రోటరీ క్లబ్ లేక్ డిస్టిక్ మొయినాబాద్ అధ్యక్షులు ఓదెల రాజశేఖర్, డాక్టర్ వెంకట రంగారెడ్డితో పాటు ఆయా విభాగాలకు చెందిన డాక్టర్లు,  సదాశివపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్  ఓదెల ప్రభు గుప్తా, సెక్రెటరీ అశోక్ కుమార్ బస్సా, కోశాధికారి వేణు, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.