18-06-2025 08:41:08 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) డోర్నకల్ సమీపంలో మున్నేరు వాగులో ఈతకు వెళ్లి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యాడు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన జాబిశెట్టి సందీప్ డోర్నకల్ లో రైల్వే గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం మున్నేరువాగులో ఈతకు వెళ్లి నీట మునిగి దుర్మరణం పాలయ్యాడు. డోర్నకల్ పోలీసులు మృతదేహాన్ని వాగు నుండి బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం పంపి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.